ఈవూరి నర్సిరెడ్డి గారు

ఈవూరి నర్సిరెడ్డి గారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రజాకార్లను ఎదురొడ్డి పోరాడిన గొప్ప ధీరోదాత్తుడు,బహుభాషా కోవిదుడు,బహుముఖ ప్రజ్ఞాశాలి.ఈయన స్వాతంత్ర్య పోరాటంలోనే గాక, స్వాతంత్ర్యానంతరం కూడా బడుగు, బలహీనవర్గాల రక్షణ కోసం,అభివృద్ధి కోసం, వారికి మెరుగైన జీవితాన్ని అందించడం కోసం తన ధన,మాన,ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అగ్రవర్ణాలకు,అగ్రవర్ణ ఆధిపత్య వైఖరికి ఎదురు నిల్చి ఎన్నో సంస్కరణలను అమలు చేసి,దళిత బిడ్డల విద్యాభివృద్ధికి కృషి చేయటం జరిగింది.ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని ఒక యోధుడు గురించి మనం తెలుసుకోబోతున్నం.